Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర సంఘటన జరిగింది. అన్నం తింటుండగా కూర వేయలేదని రవి అనే వ్యక్తి రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్రగాయాలైన రుక్మిణిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని కోపంతో రుక్మిణి అనే మహిళపై రవి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఇద్దరూ కిటికీలు తయారు చేసే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. భోజనం సమయంలో చిన్న విషయంపై మాటామాటా పెరిగి రవి ఆగ్రహంతో రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

