Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర సంఘటన జరిగింది. అన్నం తింటుండగా కూర వేయలేదని రవి అనే వ్యక్తి రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్రగాయాలైన రుక్మిణిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని కోపంతో రుక్మిణి అనే మహిళపై రవి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఇద్దరూ కిటికీలు తయారు చేసే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. భోజనం సమయంలో చిన్న విషయంపై మాటామాటా పెరిగి రవి ఆగ్రహంతో రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Follow Us
వైరల్ వీడియోలు
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

