Khammam: మరి ఇంతకన్నా పాపం ఉంటుందరా.. అన్నం తింటుండగా కూర వేయలేదని..
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర సంఘటన జరిగింది. అన్నం తింటుండగా కూర వేయలేదని రవి అనే వ్యక్తి రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్రగాయాలైన రుక్మిణిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని కోపంతో రుక్మిణి అనే మహిళపై రవి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఇద్దరూ కిటికీలు తయారు చేసే ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. భోజనం సమయంలో చిన్న విషయంపై మాటామాటా పెరిగి రవి ఆగ్రహంతో రుక్మిణిపై గొడ్డలితో దాడి చేశాడు. మెడ కింది భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Follow Us
వైరల్ వీడియోలు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

