POK లో జనగణమన వీడియో
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం అరాచకాలపై నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రజలు స్వాతంత్ర్యం, భారత్లో విలీనం కోరుకుంటూ జనగణమన పాడుతున్నారు. ఈ ఆందోళనలపై పాకిస్తాన్ భద్రతా బలగాల అణచివేత చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది, మానవ హక్కుల ఉల్లంఘనపై వివరణ డిమాండ్ చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్తాన్ సైన్యం దౌర్జన్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. అసి మునీర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.పీవోకే ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. చాలా మంది భారత్లో విలీనాన్ని అభిలషిస్తూ జనగణమన పాడుతున్నారు. ముజఫరాబాద్, రావల్కోట్, నీలం లోయ, కోట్ల వంటి ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులకు నిప్పులు పెట్టి, వంతెనలను దిగ్బంధించారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి
టప టపా పేలిపోయిన సెల్ ఫోన్లు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర ... కళ్ళు చెదిరే దృశ్యం
మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు
హలీం ధరకు రెక్కలు..సింగిల్ ప్లేట్ ఏకంగా..

