తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్న కూతురు

Updated on: Nov 05, 2025 | 6:00 PM

జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రియాంక, రాకేష్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, జులై 27న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు, విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని, కిడ్నాప్ చేయబోయారని ఆరోపిస్తూ ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రియాంక, రాకేష్ ప్రేమించుకుంటున్నారు. రాకేష్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి, జులై 27న ప్రియాంక, రాకేష్ గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, వారిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ