AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే

Phani CH
|

Updated on: Oct 14, 2025 | 3:17 PM

Share

కోరింత దగ్గు.. ఈ పేరు వింటేనే తల్లిదండ్రులు హడలిపోతుంటారు. బ్యాక్టీరియా వల్ల సులభంగా వ్యాపించే ఈ శ్వాసకోశ వ్యాధి పిల్లలకు పట్టిందంటే అంత ఈజీగా వదలదు. సాధారణ జలుబుతో ప్రారంభమై, తర్వాత తీవ్రమైన దగ్గు వస్తుంది, దీని వలన శ్వాస తీసుకోవడం, తినడం, నిద్రించడం కష్టమవుతుంది. చిన్న పిల్లలు, ముఖ్యంగా ఆరు నెలల లోపు పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం.

కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని అద్యయనం పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చుకునేటపుడు పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది. పెద్దలు, పిల్లలకు ఇది కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇది అత్యంత తీవ్రమైన అంటురోగం. చికాగోలోని ఆన్‌ అండ్‌ రాబర్ట్‌ హెచ్‌ లురీ పిల్లల దవాఖానలో ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న కెయిట్లిన్‌ లీ ఈ అధ్యయనానికి లీడ్‌ ఆథర్‌. శిశువుల్లో కోరింత దగ్గు లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయని కెయిట్లిన్‌ చెప్పారు. గర్భిణులకు కోరింత దగ్గు టీకాను ఇవ్వడం చాలా అవసరమని కెయిట్లిన్‌ చెప్పారు. దీనివల్ల నవజాత శిశువులకు ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ది యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫారసుల ప్రకారం, ఈ టీకాలను 2, 4, 6, 15-18 నెలలు; 4-6 సంవత్సరాల వయసులో ఇవ్వాలని కెయిట్లిన్‌ లీ సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంత కూతురిని కిడ్నాప్‌ చేసిన తండ్రి.. వీడియో వైరల్‌

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ వైభవం.. చూసి తీరాల్సిందే!

5.8 కిలోల బరువుతో శిశువు జననం.. వైరల్‌గా వీడియో

తులం బంగారం రూ.3 లక్షలు కానుందా

అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను