రైలు ప్రయాణికులకు అలర్ట్..
భారతీయ రైల్వేలు 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నియమం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన తొలి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. తత్కాల టిక్కెట్లకు ఇప్పటికే ఆధార్ లింక్ తప్పనిసరి కాగా.. ఈ కొత్త నియమం ద్వారా అక్రమాలను నియంత్రించి నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు దొరకే అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలకమైన ప్రకటన చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల టిక్కెట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి అయినప్పటికీ ఈ కొత్త నిర్ణయంతో జనరల్ కోటా టిక్కెట్ల బుకింగ్లోనూ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఈ కాల వ్యవధిలోనే అధిక డిమాండ్ ఉండటం, అక్రమాలను నివారించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రయాణికులు అక్టోబర్ 1 లోగా తమ IRCTC ఖాతాకు ఆధార్ను లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తుంది.
Published on: Sep 17, 2025 04:45 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

