రైలు ప్రయాణికులకు అలర్ట్..
భారతీయ రైల్వేలు 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నియమం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన తొలి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. తత్కాల టిక్కెట్లకు ఇప్పటికే ఆధార్ లింక్ తప్పనిసరి కాగా.. ఈ కొత్త నియమం ద్వారా అక్రమాలను నియంత్రించి నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు దొరకే అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలకమైన ప్రకటన చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల టిక్కెట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి అయినప్పటికీ ఈ కొత్త నిర్ణయంతో జనరల్ కోటా టిక్కెట్ల బుకింగ్లోనూ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఈ కాల వ్యవధిలోనే అధిక డిమాండ్ ఉండటం, అక్రమాలను నివారించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రయాణికులు అక్టోబర్ 1 లోగా తమ IRCTC ఖాతాకు ఆధార్ను లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తుంది.
Published on: Sep 17, 2025 04:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

