ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సంఘటన సంతోషాన్నిచ్చింది. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెనల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. 17 రోజులపాటు నిరంతరంగా జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మెటల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెషనల్.

ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..

|

Updated on: Dec 04, 2023 | 1:14 PM

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సంఘటన సంతోషాన్నిచ్చింది. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెనల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. 17 రోజులపాటు నిరంతరంగా జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మెటల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెషనల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో టెక్నాలజీని అందిపుచ్చుకొని పొట్టి శ్రీరాములు జిల్లా తడ ప్రాంతంలో శ్రీ సిటీలో తన సంస్థ బోరోలెక్స్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. నవంబర్ 25న డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి… శ్రీనివాస్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఉత్తరాఖండ్ ప్రమాదానికి సంబంధించి రిస్కీ ఆపరేషన్‌లో ఆయన సహాయం కావాలని కోరారు. వెంటనే స్పందించిన శ్రీనివాసరెడ్డి కేవలం మూడు గంటల్లోనే దానికి అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా ఈ ఆపరేషన్ చేయాలని నిర్ధారించుకున్న శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన టీం ను సిద్ధం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజాను వదిలి ఇంకెక్కడికి వెళ్లాలంటూ బాధితుల గగ్గోలు

సాయం కోసం హిమాలయాలు ఘోషిస్తున్నాయి

అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి 6వేల మందికి ఆహ్వానం

గన్నుతో బెదిరించి కూతురి మెడలో తాళికట్టించిన మామ !!

ప్రియుడు చెప్పాడని.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా !!

 

Follow us