AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్

Hyderabad: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్

Sridhar Rao
| Edited By: |

Updated on: Jan 16, 2025 | 4:39 PM

Share

Hyderabad News: కూకట్‌పల్లి KPHBలోని కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. కాసేపటికే పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.

హైదరాబాద్, 16 జనవరి 2025: కూకట్‌పల్లి KPHBలోని కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. కాసేపటికే పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. సంక్రాంతి సందర్భంగా వరుసగా సెలవులు కావడంతో రెస్టారెంట్ రెండు రోజులు ఓపెన్ చేయలేదు. రెస్టారెంట్ లో వర్కర్స్ ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెస్టారెంట్ పక్కన ఉన్న కరెంటు స్తంభంపై షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మంటలు ఒక్కసారిగా రెస్టారెంట్లోని కిచెన్ లోకి వ్యాపించడంతో రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది.అక్కడున్న రెండు బైకులు కూడా పూర్తిగా కాలిపోయాయి. రెస్టారెంట్ లోని ఫర్నిచర్ మొత్తం పూర్తిగా కాలిపోయింది.

రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అందులోనే పడుకొని ఉన్నాడు. రెస్టారెంట్లో పని చేస్తున్న కుమార్ ధైర్యం చేసి అద్దాలు పగలగొట్టి లోపల పడుకొని ఉన్న ఓనర్‌ని బయటికి తీసుకొచ్చాడు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే సమయానికే రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది. సుమారు రెండు కోట్ల వరకు నష్టం వాటిలిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jan 16, 2025 04:33 PM