శాడిస్ట్‌ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు

|

Sep 08, 2023 | 9:52 AM

కాలం మారినా.. ఇంకా కొందరు కట్నం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కట్నం కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీముచ్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ కిర్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. రూ.5 లక్షల కట్నం కావాలంటూ ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు.

కాలం మారినా.. ఇంకా కొందరు కట్నం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కట్నం కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీముచ్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ కిర్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. రూ.5 లక్షల కట్నం కావాలంటూ ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఆమెను తాడుతో బావిలో వేలాడదీశాడు. భయంతో భార్య ఏడుస్తూ ఉండగా.. ఈ ఘటనను వీడియో తీసి ఆమె బంధువులకు షేర్‌ చేశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెను రక్షించాలంటూ అదే ప్రాంతంలోని కొందరిని సంప్రదించారు. చాలా సేపటి తర్వాత భార్యను బయటకు తీశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేశ్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..

మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని

Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్‌

Jawan: జవాన్‌ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్

Jawan Review: యాక్షన్‌ థ్రిల్లర్‌ జవాన్.. హిట్టా ?? ఫట్టా ?? మూవీ రివ్యూ చూసేయండి

 

Follow us on