Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొరంగంలోంచి కార్మికులు ఎలా బయటకొస్తారో తెలుసా ??

సొరంగంలోంచి కార్మికులు ఎలా బయటకొస్తారో తెలుసా ??

Phani CH

|

Updated on: Nov 26, 2023 | 9:01 PM

ఉత్తరాఖండ్​లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మరికొన్ని గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 45 మీటర్ల మేర శిథిలాల గుండా సమాంతరంగా ప్రవేశపెట్టారు. గత రాత్రి స్టీల్ మెష్‌ పైపునకు అడ్డుపడడంతో పైపులైన్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ నిలిచిపోయింది. మెషన్‌ను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి.. ఉదయానికి పూర్తిగా తొలిగించారు.

ఉత్తరాఖండ్​లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మరికొన్ని గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 45 మీటర్ల మేర శిథిలాల గుండా సమాంతరంగా ప్రవేశపెట్టారు. గత రాత్రి స్టీల్ మెష్‌ పైపునకు అడ్డుపడడంతో పైపులైన్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ నిలిచిపోయింది. మెషన్‌ను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి.. ఉదయానికి పూర్తిగా తొలిగించారు. ఇప్పుడు ఆఖరి పైపును శిథిలాల ద్వారా కార్మికులు ఉన్న చోటకు చేర్చారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్​డీఆర్​ఫ్​ బృందం సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వారు ముందే ట్రయల్‌ నిర్వహించారు. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేకంగా తయారు చేయించిన చక్రాల స్ట్రెచర్‌ను ఆక్సిజన్ కిట్‌తో పాటు కార్మికుడికి పంపనున్నారు. స్ట్రెచర్‌పై పడుకున్న కార్మికుడిని తాళ్ల సహాయంతో బయటకు లాగనున్నారు. ఒకరి తర్వాత ఒకరిని బయటకు చేర్చేలా ప్రణాళిక పూర్తి చేశారు. ఇందుకు విజయవంతంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారు

మెడలో పొడవాటి కరెన్సీ మాలతో షాకిచ్చిన వరుడు !! అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు

ఇతర దేశాల్లో ఉన్న హమాస్‌ అగ్రనేతలపై కఠిన చర్యలు !!

రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత ??

సగం బెడ్‌ను అద్దెకు ఇస్తానంటున్న మహిళ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ ప్రకటన