Chennai: చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!

Updated on: Dec 10, 2023 | 1:03 PM

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు చెన్నై అతలాకుతమైపోయాయి. భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు, రహదారులు అన్నీ నీటమునిగాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ పరిస్థితినుంచి చెన్నై ఇంకా కోలుకోకుండానే వాతారణశాఖ మరోసారి చెన్నైకి అలర్ట్‌ జారీ చేసింది. రానున్న ఐదురోజులూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు చెన్నై అతలాకుతమైపోయాయి. భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు, రహదారులు అన్నీ నీటమునిగాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ పరిస్థితినుంచి చెన్నై ఇంకా కోలుకోకుండానే వాతారణశాఖ మరోసారి చెన్నైకి అలర్ట్‌ జారీ చేసింది. రానున్న ఐదురోజులూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నగరంలో స్కూళ్లు,కాలేజీలు మూసివేసారు. ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్‌, దిండిగల్‌, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. మిచౌంగ్‌ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లగా.. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.