దక్షిణాది నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సాధారణ ఉష్నోగ్రతల కన్నా 2,3 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతున్నాయంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య సమయంలో రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో వడగాలులు వీయనుండగా.. ఉత్తర తెలంగాణతో పాటు భద్రాచలం, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.