Pedda Amberpet: పెద్ద అంబర్‌పేట్ లో దొంగల బీభత్సం

Updated on: Oct 13, 2025 | 3:13 PM

హయత్‌నగర్ పిఎస్ పరిధిలోని పెదఅంబర్‌పేటలో దొంగలు రెండు ఇళ్ళల్లో భారీ చోరీకి పాల్పడ్డారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో సెంట్రల్ లాక్‌లు పగలగొట్టి 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, రూ. 60 వేల నగదు అపహరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

హయత్‌నగర్ పిఎస్ పరిధిలోని పెదఅంబర్‌పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండు ఇళ్ళల్లో చోరీలకు పాల్పడ్డారు. అత్యంత భద్రత కలిగిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దొంగలు సుమారు 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదుతో పాటు విలువైన చీరలను అపహరించినట్లు తెలుస్తోంది. చోరీ దృశ్యాలు కమ్యూనిటీలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bihar Politics: బిహార్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ

ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా

ఒంగోలు పేస్‌ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం