మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్‌ కట్టిన మెట్రో

|

Oct 23, 2023 | 9:22 AM

ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి సమయాన్ని వృథా చేసినందుకు 5 వేల రూపాయల ఫైన్, కేసు ఖర్చుల కోసం అదనంగా మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సైదాబాద్ కు చెందిన అబ్దుల్ ఖాదిర్ అనే న్యాయవాది 2022 డిసెంబర్ 16న హఫీజ్ పేట్ కు వెళ్లేందుకు మెట్రో రైల్ ఎక్కారు.

ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి సమయాన్ని వృథా చేసినందుకు 5 వేల రూపాయల ఫైన్, కేసు ఖర్చుల కోసం అదనంగా మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సైదాబాద్ కు చెందిన అబ్దుల్ ఖాదిర్ అనే న్యాయవాది 2022 డిసెంబర్ 16న హఫీజ్ పేట్ కు వెళ్లేందుకు మెట్రో రైల్ ఎక్కారు. దిల్ సుఖ్ నగర్ నుంచి మలక్ పేట వరకు మెట్రో రైల్లో ప్రయాణించాడు. అక్కడ ట్రైన్‌ దిగి సైన్ బోర్డులు చూస్తూ తన మెట్రో కార్డును ట్యాప్ చేశాడు. కొంతం దూరం వెళ్లిన తర్వాత తాను వెళ్లాల్సిన మార్గం మరోవైపు ఉందని గుర్తించాడు. కార్డు అప్పటికే ట్యాప్ చేయడంతో అతను మళ్లీ వెనక్కి వెళ్లేందుకు మెట్రో సిబ్బంది అనుమతించలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి !! నష్టపరిహారం చెల్లించింది సంస్థ

దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది

ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి

ఎట్టకేలకు మణప్పురం బంగారం దొంగ దొరికేసింది

Follow us on