మళ్లీ పెరిగిన బంగారం ధరలు! తులం ఎంతంటే వీడియో

Updated on: Sep 27, 2025 | 8:59 AM

దసరా, దీపావళి పండుగలకు ముందు బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.330 నుంచి రూ.440 వరకు పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని తాజా 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం, కిలో వెండి ధరల వివరాలను సెప్టెంబర్ 26 శుక్రవారం నాటి నివేదిక వెల్లడించింది.

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పండుగల సీజన్‌కు ముందు ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు నిరాశ కలిగిస్తోంది. 10 గ్రాముల తులం బంగారం ధర రూ.330 నుంచి రూ.440 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 26, శుక్రవారం నాటి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1,14,880 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1,05,300గా నమోదైంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,49,000 పలుకుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో