నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ఖడ్గమృగానికి కంటి ఆపరేషన్‌

Updated on: Dec 05, 2023 | 9:50 PM

అవును, మీరుచదివింది నిజమే.. 11 ఏళ్ల ఖడ్గమృగానికి మేజర్‌ సర్జరీ నిర్వహించారు ప్రభుత్వ పశువైద్యులు. ఈ అరుదైన సంఘటన హైదరాబాద్‌ జంతుప్రదర్శనశాలలో జరిగింది. 6 ఏళ్ల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల ఖడ్గమృగం ఖడ్గమృగం సాయి విజయ్‌కు సోమవారం హైదరాబాద్ జూలో వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ జంతువు ఎడమ కనుగుడ్డు పెరుగుదలకు చికిత్స పొందుతోందని, గత ఆరు నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోందని జూ నిర్వహాకులు చెప్పారు.

అవును, మీరుచదివింది నిజమే.. 11 ఏళ్ల ఖడ్గమృగానికి మేజర్‌ సర్జరీ నిర్వహించారు ప్రభుత్వ పశువైద్యులు. ఈ అరుదైన సంఘటన హైదరాబాద్‌ జంతుప్రదర్శనశాలలో జరిగింది. 6 ఏళ్ల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల ఖడ్గమృగం ఖడ్గమృగం సాయి విజయ్‌కు సోమవారం హైదరాబాద్ జూలో వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ జంతువు ఎడమ కనుగుడ్డు పెరుగుదలకు చికిత్స పొందుతోందని, గత ఆరు నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోందని జూ నిర్వహాకులు చెప్పారు. ఈ క్రమంలోనే జంతువుకు ఆపరేషన్‌ చేయించినట్టుగా తెలిపారు. జూ మరియు వన్యప్రాణుల సంరక్షణ అధికారుల సమక్షంలో దానికి అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ రైనోస్‌ను మైసూర్ జూ నుంచి కొనుగోలు చేసినట్టుగా సమాచారం. డాక్టర్ జి. శంభులింగం, డాక్టర్ ఎం.ఎ.హకీం, డాక్టర్ సిహెచ్‌తో సహా పశువైద్యుల బృందం న్యూక్లియేషన్ కోసం రైనోకు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌ విజయవంతమైనట్టు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిచౌంగ్‌ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌

అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే

థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి

హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us