TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్

Updated on: Dec 23, 2025 | 4:53 PM

సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ తారలు పిటిషన్స్‌ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ధురంధర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రిలీజ్‌ అయి మూడు వారాలు ముగిసినా కూడా ఈ మూవీ కలెక్షన్స్‌ ఇంకా దిమ్మతిరిగే రేంజ్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ బాహుబలి2 రికార్డును బద్దలు కొట్టింది. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా 16వ రోజు ఇండియా వైడ్‌గా అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన.. రూ. 36 కోట్ల రికార్డు బాహుబలి 2 పేరిట ఉంది. ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను ధురంధర్ అధిగమించింది. ధురంధర్ 16వ రోజు ఏకంగా రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లతో, బాహుబలి 2 పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది ధురంధర్ మూవీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు

ఇదేమి చలిరా బాబోయ్‌.. నెలాఖరు దాకా ఇంతేనట

పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్

Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్