ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వస్తున్న చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాతాళగంగ మెట్ల సమీపంలోని ఓ ఇంటిలోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డై వైరల్ అయ్యాయి. తిరుమల తర్వాత ఇప్పుడు శ్రీశైలంలో ఈ బెడద పెరిగి, స్థానికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పుణ్యక్షేత్రాల్లో కొద్ది రోజులుగా చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. వనం దాటి జనంలోకి వస్తున్నాయి. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు తిరుమలలో భక్తులను చిరుత పులులు వణికించాయి. టీటీడీ అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీశైలం వంతు వచ్చింది. శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మెట్లవైపు ఉన్న ఓ ఇంటి ప్రాంగణంలోకి గురువారం అర్ధరాత్రి చిరుత వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇవి వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో తరచూ ఇక్కడ వన్యమృగాలు సంచరిస్తుండటం కామనై పోయింది. అయితే ఇప్పుడు చిరుత ఏకంగా ఇంటిలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతాళగంగ మెట్లవైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ చిరుతపులి సంచారం ఉండడంతో అప్రమత్తతలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి చిరుత పులి రావడం ఇది రెండోసారి. కృష్ణానది తీరం, శివారు ప్రాంతం కావడంతో అక్కడ తరచూ సంచరిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహ్లీ, రోహిత్ గురించి పఠాన్ అంత మాటనేశాడేంటి ??
శ్రీశైలంలో చిరుత హల్చల్.. పూజారి ఇంటి ఆవరణలో
‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు
ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్పై ఫైర్ అవుతున్న మత పెద్దలు
Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్ కెరీర్కే మచ్చలాంటి సినిమా
