నో ఎక్స్‌క్యూజ్‌ అంటున్న సమంత… అంతర్జాతీయ వేదిక మీద వాయిస్ వినిపిస్తున్న హీరోయిన్‌

Updated on: Nov 29, 2025 | 1:17 PM

సమంత అంతర్జాతీయ వేదికపై మహిళల సమస్యలపై గళమెత్తారు. ఐక్యరాజ్యసమితి నో ఎక్స్‌క్యూజ్ కార్యక్రమంలో పాల్గొంటూ, మహిళలపై జరిగే ఆన్‌లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలపై మాట్లాడారు. సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల చాలా మంది కెరీర్‌లు వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, బలమైన వ్యవస్థలు కావాలని పిలుపునిచ్చారు.

తెలుగు చలనచిత్ర నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా వ్యవహారాలతో పాటు సామాజిక స్పృహతో కూడిన కార్యక్రమాలలోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె ఒక అంతర్జాతీయ వేదికపై మహిళల సమస్యలపై తన గళం వినిపించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నో ఎక్స్‌క్యూజ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. నవంబర్ 25న మొదలైన ఈ ఈవెంట్‌లో, సోషల్ మీడియాలో మహిళలపై వస్తున్న అనుచిత కామెంట్లు, ఆన్‌లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోల వంటి సున్నితమైన అంశాలపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌