రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. ఆయన స్పృహలోకి వచ్చారని అపోలో ఆస్పత్రి సిబ్బంది ప్రకటించారు. అంతేకాదు తేజ్కి వెంటిలేటర్ను తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మరికొన్ని రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు.. తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు తెలిపారు. ఇక తేజ్కి ప్రమాదం జరిగినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన చోటు చేసుకుంది. మెగా అభిమానులు తేజు కోలుకోవాలంటూ.. అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న మాజీ లెజెండ్స్..(వీడియో)
Share Market Video: లక్ష పెట్టుబడి పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..! ఎలానో ఈ వీడియో చూడండి..
FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).