రజినీకాంత్, కమల్ మల్టీస్టారర్ పై క్లారిటీ వీడియో
రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, రెగ్యులర్ షూట్, దర్శకుడి వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, రజినీకాంత్ కూతురు సౌందర్య త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు. 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కలిసి నటించనున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ ఇండియన్ సినిమా లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో కే. బాలచందర్ శిష్యులుగా పలు చిత్రాలలో కలిసి నటించిన ఈ అగ్రతారలు, 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం తర్వాత పూర్తిస్థాయి పాత్రలలో కనిపించలేదు. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్లుగా ఎదగడంతో, వారిద్దరితో మల్టీస్టారర్ చేసే సాహసం ఏ దర్శకుడూ చేయలేకపోయాడు. 2020లో లోకేష్ కనకరాజ్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇటీవల కమల్ హాసన్ స్వయంగా రజినీకాంత్తో మల్టీస్టారర్ను అధికారికంగా ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
