అవును.. రాజ్‌తరుణ్‌ నిందితుడే పోలీసుల చార్జిషీట్‌

|

Sep 09, 2024 | 8:28 PM

నటులు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా.. దీనికి సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు.

నటులు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా.. దీనికి సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్‌తరుణ్. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. విచారణకు హజరుకావాంటూ నోటీసులు ఇచ్చారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ పోలీసులకు రాజ్‌తరుణ్‌ లేఖరాశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోల్‌కత ట్రైనీ డాక్టర్‌ పై జరిగింది గ్యాంగ్ రే***ప్‌ కాదా ??

66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా

ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!

కిస్మిస్‌ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు

7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్‌ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!

Follow us on