సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా

Updated on: Mar 16, 2026 | 9:04 PM

ఇండియన్ సినిమా తన సాంకేతిక ప్రమాణాలను పెంచుకుంటూ హాలీవుడ్ స్థాయికి చేరుకుంటోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో భాగంగా, మేకర్స్ ఐమాక్స్, డాల్బీ సినిమా వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్ AA22, రామాయణ వంటి చిత్రాలు ప్రపంచ స్థాయి విజువల్స్, ఆడియో అనుభూతులను అందించడానికి సిద్ధమవుతున్నాయి.

ఇండియన్ సినిమా రేంజ్ మారుతోంది. ఇన్నాళ్లూ రీజనల్ కంటెంట్‌తో కమర్షియల్ సినిమాలు తీసిన మేకర్స్, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో భాగంగా సినిమా స్పాన్‌తో పాటు టెక్నికల్ స్టాండర్డ్స్‌ను కూడా పెంచుతున్నారు. అప్‌కమింగ్ ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయిని తలపించేలా తెరకెక్కుతున్నాయి. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం వారణాసి. ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్‌లు అందుబాటులో లేకపోయినా, జక్కన్న ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. సినిమా విడుదలయ్యే నాటికి కనీసం ఒకటి రెండు ఐమాక్స్ స్క్రీన్‌లైనా వస్తాయనే ఆశాభావం ఉంది. తాజాగా, పెద్ది చిత్ర బృందం తమ సినిమాను డాల్బీ సినిమా ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆడియన్స్‌కు సరికొత్త విజువల్, ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్

‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’

Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

Follow Us