భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్
కొత్త వింత, పాత రోత.. అనే సామెత ఉంది. అయితే ఈ సామెతే ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ విషయంలో నిజమైంది. ఎందుకంటే తాను దీర్ఘ సుమంగళిగా ఉండాలని.. సావిత్రి వ్రతాన్ని ఆచరించిన ఈ హీరోయిన్ ఆ వ్రతంలో భాగంగా తన భర్త కాళ్లు కడిగిన నీళ్లను తాగేసింది. ఇప్పుడీ ఈ వ్రతాచారంతో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఎలినా సమంతరాయ్! మన దగ్గర కాదు కానీ.. ఒడిశా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.
అభయ్ సినిమాతో అక్కడ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ బ్యూటీ… తన యాక్టింగ్ తో ఒడిశా స్టేట్ ఫిల్మ్ అవార్డ్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డు అందుకుంది. అయితే కెరీర్ పీక్లో ఉండగానే.. పెళ్లికి రెడీ అయిపోయిన ఈ బ్యూటీ… 2024 నవంబర్లో అనురాగ్ పండా అనే వ్యక్తితో ఇండోనేసియాలోని బాలిలో గ్రాండ్గా తన పెళ్లి వేడుక చేసుకుంది. ఎట్ ప్రజెంట్ తన మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ… రీసెంట్గా సావిత్రి వ్రతం చేసింది. అయితే ఈ వ్రతంలోనే భాగంగా…. తన భర్త పాదాలను కడిగింది. అంతటితో ఆగకుండా… తన భర్త కాళ్లు కడిగిన ఆ నీళ్లను ప్రసాదంగా భావించి తాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసింది. దీంతో ఈ బ్యూటీ ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జమానాలో కూడా ఇలాంటి పని చేయడమేంటనే షాకింగ్ కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ట్రోల్ అవుతోంది ఎలినా..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

