భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??

|

Mar 04, 2024 | 4:45 PM

ఇటీవలే ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నయనతార కు ప్రస్తుతం ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నయనతార కు ప్రస్తుతం ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టారు. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తుంది. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ ల కాంబినేషన్ లో ఎస్‌. శశికాంత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో

100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి

బ్లాక్‌ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుక

అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్రం సాయం అర్థించిన భారతీయ నటి

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు

Follow us on