శంకర్కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు మద్రాస్ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. శంకర్ స్థిర, చరాస్తులను జప్తు జేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇక సూపర్ హిట్ చిత్రం ఎంథిరన్లోని ఆర్థిక అవకతవకలు జరిగియంటూ డైరెక్టర్ శంకర్పై అప్పట్లో కేసు నమోదైంది.
శంకర్ దర్శకత్వం వహించిన ఎంథిరన్ చిత్రంలో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగట్టు గుర్తించిన ED.. శంకర్కు చెందిన రూ.11.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అయితే, తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్ చరణ్తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్
పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా
Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?
Loading...
Unable to load recommendations.
Follow Us