శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

|

Oct 27, 2024 | 9:55 PM

గ్లోబల్‌ మెగాస్టార్‌ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి, మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.

లండన్, దుబాయ్, సింగపూర్ ఇలా పలు చోట్ల హీరోల వ్యాక్స్ స్టాట్యూలను ఏర్పాటు చేస్తుంటారు. ఎంతో గర్వంగా భావించే ఈ జాబితాలో చెర్రీ కూడా చేరడం విశేషం. తాజాగా ఈ అరుదైన గౌరవం మన గ్లోబల్ స్టార్‌కు దక్కింది. ఈ విషయాన్ని అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌తోపాటు ఆయన పెట్‌ డాగ్‌ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్‌ రిలీజ్‌ విడుదల చేశారు. రామ్‌ చరణ్‌ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క వెంటపడి.. థర్డ్ ఫ్లోర్‌ నుంచి కింద పడ్డ యువకుడు

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..

‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన నయన్‌

Follow us on