కుర్ర హీరోలు కనబడుటలేదు.. జాడ కోసం వెతుకుతున్న ఫ్యాన్స్..

Edited By:

Updated on: Oct 09, 2025 | 4:34 PM

ఎంత స్టార్ హీరో అయినా.. రెగ్యులర్‌గా ఆడియన్స్‌తో టచ్‌లో ఉంటేనే ఆ ఇమేజ్‌ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ జనరేషన్‌ యంగ్ హీరోలు ఆ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు. కెరీర్‌లో ప్రైమ్‌ ఫేజ్‌లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు ఆ హీరోలను పూర్తిగా మర్చిపోయే సిచ్యుయేషన్‌ క్రియేట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.

ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసిన కుర్ర హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు. గతంలో వరుస సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు రెండు మూడుళ్లుగా సిల్వర్‌ స్క్రీన్‌కు దూరంగా ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ తలకెత్తుకొని అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నారు. సాయి దుర్గ తేజ్‌, వైష్ణవ్ తేజ్‌ తెర మీద కనిపించి చాలా కాలం అవుతుంది. మంచి మార్కెట్‌ ఉన్నా… ఈ ఇద్దరు హీరోలు నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో స్టో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవున్నారు. నాగశౌర్య, నిఖిల్ పరిస్థితి మరోలా ఉంది. భారీ డిజాస్టర్ తరువాత కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరోలు… ఒకే ప్రాజెక్ట్‌ను ఏళ్ల తరబడి చెక్కుతూ వస్తున్నారు. అడివి శేష్‌, అఖిల్ లాంటి హీరోల ప్లానింగ్‌ మరోలా ఉంది. ముందు అనుకున్న కాస్టింగ్ సెట్ కాకపోవటంతో, కథలో మార్పులు, రీషూట్‌లతో ఈ హీరోల కెరీర్‌లోనూ లాంగ్ గ్యాప్‌ తప్పలేదు. రీజన్‌ ఏదైనా… యంగ్ హీరోలు ప్రైమ్‌ ఫేజ్‌లో ఇలా బ్రేక్ తీసుకోవటం కెరీర్‌కు అంత మంచిది కాదంటున్నారు క్రిటిక్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొక్కిసలాట ఘటనపై.. సుప్రీంకోర్టుకు విజయ్ పార్టీ

కాంతార సక్సెస్‌ ఎఫెక్ట్.. ఏకంగా రూ.12 కోట్లతో.. కోటలాంటి ఇల్లు కట్టుకున్న రిషబ్‌

గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్ బాస్‌.. దెబ్బకు బిత్తర పోయిన కంటెస్టెంట్స్

కోట్లు ఇచ్చినా.. స్టార్ హీరోలతో కొట్టించుకోను.. సినిమా ఛాన్స్‌పై మల్లారెడ్డి చమత్కారం!

మురుగు నీరు కారణంగా చిక్కుల్లో బిగ్ బాస్‌ !! షో ఆగిపోయే పరిస్థితి !!

Published on: Oct 09, 2025 02:01 PM