” ఆ బాధ ఊహించడానికే భయంగా ఉంది”: రష్మిక వీడియో
కర్నూలు బస్సు ప్రమాదంపై నటి రష్మిక మందన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల బాధను ఊహించడానికే భయంగా ఉందన్నారు. కిరణ్ అబ్బవరం, సోను సూద్ కూడా స్పందించారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బస్సు భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నటీనటులు కోరారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంపై నటి రష్మిక మందన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలిపోయే ముందు ప్రయాణికులు పడిన బాధను ఊహించడానికే భయంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ప్రార్థనలు ఉంటాయని తెలిపారు. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారని, మొత్తం 46 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందని వెల్లడైంది. నటుడు కిరణ్ అబ్బవరం సైతం ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను తలుచుకుంటే తన హృదయం బరువెక్కిందని పోస్ట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రష్మిక, కిరణ్తో పాటు సోను సూద్ కూడా విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్ సేఫ్టీ వీడియో
ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో
ల్యాప్టాప్స్ చార్జింగ్ పెట్టడంతో వీడియో
వైరల్ వీడియోలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
