పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు డ్యూయెల్ రోల్ చేసాడు కానీ త్రిపాత్రభినయం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది.బింబిసార సినిమా మూడు పార్ట్స్ అని.. కొన్ని రెండు పార్ట్స్ గా రాబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా ఈ చిత్రం కేవలం ఒకే పార్ట్ ఉంటుందని సీక్వెల్స్ ఉండవని వినికిడి.
మరిన్ని ఇక్కడ చూడండి: వైరల్ అవుతున్న వరుణ్ బాక్సింగ్ వీడియో…! గని సినిమా కోసం కష్టపడుతున్న మెగా ప్రిన్స్ :video of Varun Tej.