మరో మూవీ నుంచి దేవీ అవుట్‌ ?? మైత్రీతో దేవీకి సమ్ థింగ్, సమ్ థింగ్

Edited By:

Updated on: Nov 30, 2024 | 1:47 PM

మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అలాంటి డిఎస్పి పేరు ఈ మధ్య వివాదాల్లో కూడా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారని మైత్రి మూవీ మేకర్స్ నేరుగా చెప్పడంతో అసలు సమస్య మొదలైంది.

అసలు దేవి శ్రీ ప్రసాద్ ఉండగా ఇంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు పని చేస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. దానికి దేవీ నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. ఇక దేవీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సుకుమార్‌కు నచ్చలేదని.. అందుకే తమన్ సహా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లతో రీ రికార్డింగ్ ఇప్పించాడని న్యూస్ బయటకు వచ్చింది. తమన్ కూడా తను పుష్ప 2కు పని చేసినట్లు కన్ఫర్మ్ చేశాడు. తనకు కేవలం పది రోజుల్లో సినిమా అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు కోరారని.. అయితే తను కేవలం ఫస్టాఫ్ మాత్రమే చేసి ఇచ్చానని చెప్పాడు తమన్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలని ఉంది..

Trisha: ప్రభాస్‌ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!

ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై

Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు

Loading...
Unable to load recommendations.
Follow Us