సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పూనమ్ పాండే తాను చనిపోయానని చెప్పి షాక్ ఇచ్చారు. తన మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దాంతో పూనమ్ ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. సోషల్ మీడియా యూజర్స్ మాత్రమే కాదు చాలా మంది సెలబ్రిటీలు పూనమ్ పాండేపై చాలా విమర్శలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఆమె పై కేసు కూడా నమోదైంది. అయితే ఇటీవల ఆమె తనసోషల్ మీడియా ఖాతా నుండి గర్భాశయ క్యాన్సర్కు సంబంధించిన అన్ని సోషల్ మీడియా పోస్ట్లను తొలగించడంతో పూనమ్ ఎక్కువగా ట్రోల్ గురైంది. ఇక ఈ క్రమంలోనే మరోసారి తన సోషల్ మీడియాలో అకౌంట్లో వివాదాస్పద పోస్ట్లను షేర్ చేసింది పూనమ్. “నిజాయితీగా చెప్పాలంటే, నా పోస్ట్ వల్ల చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలిసిందని నేను సంతోషిస్తున్నాను. నా పోస్ట్ చాలా మందికి చేరాలని అలాగే ప్రజలు దాని గురించి మాట్లాడాలన్నదే నా లక్ష్యం. అయితే ఇందుకు ఒప్పించిన వాళ్లు కొందరు.. తన చర్చతో ఆర్థికంగా ప్రయోజనం పొందారు. డబ్బు సంపాదిస్తున్నారు. అందుకు నాకు బాధగా ఉంది” అని రాసుకొచ్చింది పూనమ్.
అంతేకాదు ఆ వ్యక్తుల ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు.. ఇంత మంచి సోషల్ వర్క్ని ఎవరు కమర్షియల్గా చేశారో ఇప్పుడు మీరంతా కనుక్కోవాలి అని ఆమే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను ఇందులోకి లాగి బలిపశువు చేశారన్నట్టుగా తన పోస్ట్లో ఎక్స్ప్రెస్ చేశారు. ‘గర్భాశయ క్యాన్సర్’ గురించి అవగాహన కల్పించడానికి పూనమ్ పాండే మరణ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆమె పీఆర్ టీమ్ తెలిపారట. పూనమ్ పాండే పై ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..