AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి

నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి

Phani CH
|

Updated on: Oct 16, 2025 | 4:52 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీకి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలను నిజం చేస్తూ ఆదివారం వైల్డ్ కార్డ్స్ ద్వారా దివ్వెల మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్‌లోకి వచ్చిన దివ్వెల మాధురి తన నేపథ్యాన్ని, మనసులోని ఆలోచనలను బయటపెట్టింది.

తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను చెబుతూ మాధురి ఎమోషనల్ అయ్యింది. ‘ఇంటర్మీడియట్ లో ఉండగానే నాకు పెళ్లయిపోయింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు.కానీ మొదటి నుంచి భర్తతో నాకు అండర్ స్టాండింగ్ తక్కువ. అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ కుదర్లేదు. అందుకే మా ఆయనతో విడిపోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్‌గా జీవిస్తున్నాం. కానీ ప్రతిరోజూ సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది’ అని వెల్లడించింది. జీవితంలో చాలా నెగెటివిటీని చూశానని, మొత్తం సమాజం ఒక వైపు… తాను మరోవైపు అన్నట్లుగా గత కొన్నేళ్లుగా తన జీవితం సాగిందని చెప్పుకొచ్చింది. తన గురించి అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నానని కూడా కుండబద్దలు కొట్టింది మాధురి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాడ దొరికిన సంతరా అయ్యా..బొట్టు బిళ్లల కోసం లొల్లేంట్రా

అతనితో ప్రేమలో ఉన్నా.. కానీ పెళ్లి మాత్రం చేసుకోను

కొత్త పెళ్లికొడుకుకి ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్‌

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్‌కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది

 

Published on: Oct 16, 2025 03:12 PM