AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం చెప్పారు.. బుల్లెట్‌ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్‌ న్యాయం

సీఎం చెప్పారు.. బుల్లెట్‌ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్‌ న్యాయం

Phani CH
|

Updated on: Sep 19, 2025 | 6:41 PM

Share

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన కలకలం రేగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టమని యూపీ సీఎం యోగి హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్‌ ముఠా సభ్యులని చెప్పారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేయడంతో కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌ ప్రకటించుకుంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ పటానీ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు దిశా తండ్రి మీడియాకు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోపై ఆర్టీసీ రియాక్షన్

త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర

ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకే

TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మైండ్‌ షేక్‌ డీల్

ప్రేమాభిషేకం, డాక్టర్‌ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్‌.. అందరికీ టికెట్స్ ఫ్రీ..