రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో

Updated on: Mar 11, 2025 | 9:10 PM

బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యా రావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం . ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు . 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రన్యా రావు 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు .

ప్రతి సారి ఒకే డ్రెస్‌ తోనే దుబాయ్‌ వెళ్లారని , అందులోనే గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. కిలో బంగారం స్మగ్లింగ్‌కు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆమె వసూలు చేసినట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిప్‌కు రూ. 50 లక్షల వరకు రన్యా రావు సంపాదించినట్టు చెబుతున్నారు. ఇటీవల దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన రన్యారావు.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణికురాలిగా సెక్యూరిటీ చెకింగ్ దాటి బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ సహాయంతో ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న డీఆర్‌ఐ అధికారులు రన్యా రావును అడ్డగించి తనిఖీలు నిర్వహించగా.. ఆమె దుస్తుల్లో కిలోల కొద్ది బంగారం బయటికి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్‌ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్‌.. వీడియో

యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో