Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో చేపల పండుగను జాతరలా జరుపుతారు. ఏడాదిలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి ఊర చెరువు వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి చెరువులో దిగి చేపలను వేటాడతారు. అలా వేటాడిన చేపలన్నింటినీ చెరువు గట్టుపై ఓ పెద్ద కుప్పగా పోస్తారు. వేట ముగిశాక చెరువులోని వారందరూ బయటకు వచ్చి ఆ చేపలను సమాన భాగాలుగా చేసుకుని ఊరంతా కలిసి పంచుకుంటారు.
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో చేపల పండుగను జాతరలా జరుపుతారు. ఏడాదిలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి ఊర చెరువు వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి చెరువులో దిగి చేపలను వేటాడతారు. అలా వేటాడిన చేపలన్నింటినీ చెరువు గట్టుపై ఓ పెద్ద కుప్పగా పోస్తారు. వేట ముగిశాక చెరువులోని వారందరూ బయటకు వచ్చి ఆ చేపలను సమాన భాగాలుగా చేసుకుని ఊరంతా కలిసి పంచుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఆ చెరువులో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. గోదావరి నదికి వరద వచ్చిన సమయంలో ఊర చెరువు సైతం ఆ ఉధృతికి మునిగిపోతుంది.. అయితే అంత ఉధృతిలో కూడా అందులోని చేపలు గోదావరి నదిలో కొట్టుకు వెళ్ళిపోకుండా ఉంటాయని గిరిజనులు విశేషంగా చెబుతారు. చేపల వేట రోజున మాత్రం ఎవరు ఏ పని ఉన్నా ఎక్కడికీ వెళ్లరు. విధిగా కార్యక్రమంలో గిరిజనులందరూ హాజరవుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్ఫామ్పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

