ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన
2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనాలు విడుదల చేసింది. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది, సగటున 92% వర్షాలు అంచనా. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, రైతులు, ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయాలకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ తొలి విడత అంచనాలను విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించడంతో వ్యవసాయ రంగంపై ఆందోళన మొదలైంది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటు లో సుమారు 90 నుంచి 95 శాతం మధ్యనే ఉండవచ్చని ఐఎండీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సగటున 92 శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ‘ఎల్ నినో’ పరిస్థితులేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గి, కరవు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. 1971 నుంచి 2020 మధ్య కాలంలోని వర్షపాత డేటా ఆధారంగా, దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. దీని ఆధారంగానే ఐఎండీ తన అంచనాలను వెల్లడిస్తుంది. కాగా, రుతుపవనాల కదలికలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను మరింతగా విశ్లేషించి, మే చివరి వారంలో సవరించిన అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ తెలిపింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవనాల చివరి దశలో ఇది సానుకూలంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాలలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారత రుతుపవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి, ఈ రెండు సముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఐఎండీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. భారతదేశ సాగు భూమిలో మెజారిటీ భాగం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే ఖరీఫ్ సీజన్పై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటి నుంచే నీటి నిల్వలు, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్
AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే
VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!
‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??

