Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Quake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతగా నమోదు

Earth Quake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతగా నమోదు

Ravi Kiran

|

Updated on: Feb 27, 2025 | 6:59 AM

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో..

అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. మోరిగావ్ జిల్లాలో అర్ధరాత్రి 2:25కి భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గౌహతితోపాటు పలుచోట్ల ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అటు భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఇక రెండు రోజుల క్రితమే కోల్‌కతా సమీపంలో బంగాళాఖాతంలోనూ ఇదే తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా ఈ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు అసోంలో ఎర్త్‌క్వేక్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 27, 2025 06:58 AM