ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్

Updated on: Dec 31, 2025 | 10:56 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలువ స్థల వివాదం, ఆలయ ఉద్యోగులతో వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని, నిందితుడు హిందువేనని స్పష్టం చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు తోటపేటకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి

బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకులు

30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు