ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలువ స్థల వివాదం, ఆలయ ఉద్యోగులతో వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని, నిందితుడు హిందువేనని స్పష్టం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు తోటపేటకు చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
