ధనత్రయోదశి ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ధనత్రయోదశి పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడింది. శనివారం బంగారంపై దాదాపు రూ.3,000, వెండిపై రూ.13,000 వరకు ధర తగ్గింది. ఆదివారం అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లోని తాజా ధరలను ఇక్కడ చూడండి.
హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ధనత్రయోదశి దీపావళికి ముందు వస్తుంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలో, బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త అందింది. గత కొన్ని నెలలుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. శనివారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు రూ.3,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా రూ.13,000 వరకు పడిపోయింది. ఈ ధరల పతనం శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదివారం, అక్టోబర్ 19న ఉదయం కూడా ఈ ధరలు స్థిరంగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
