శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??

ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్‌ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్‌ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్‌ చేస్తుండగా సబ్‌ రిజిస్ట్రార్‌ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.

శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??

|

Updated on: Aug 10, 2023 | 9:18 PM

ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్‌ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్‌ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్‌ చేస్తుండగా సబ్‌ రిజిస్ట్రార్‌ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంటింట్లో దూరిన దొంగ వానరం.. ఖరీదైన కూరగాలతో పరార్‌

Follow us