AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం

Phani CH
|

Updated on: Feb 11, 2026 | 9:11 PM

Share

మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నకిలీ వెండి నాణేల పంపిణీ కలకలం రేపింది. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి నకిలీ సిల్వర్ కాయిన్స్ పంపిణీ చేశారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇది ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నమని, దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా, మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో మాత్రం నకిలీ వెండి నాణేల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నకిలీ వెండి కాయిన్స్ పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు, అభ్యర్థి మాలతి మాధవిరెడ్డిని నిలదీశారు. ఉదయం 6:00 నుంచి 7:00 గంటల మధ్య తమ ఇళ్లకు వచ్చి బలవంతంగా ఈ కాయిన్స్ ఇచ్చి వెళ్లారని స్థానికులు తెలిపారు. పంపిణీ చేసిన కాయిన్స్ 100% నకిలీవని, ఇవి జెన్యూన్ సిల్వర్ కాదని, కేవలం కోటెడ్ సిల్వర్ అని ఓటర్లు పేర్కొన్నారు. మార్కెట్ ధరలను బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోందన్నారు. ఓటర్లను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం ఇదని, ఇలాంటి చర్యలు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఓటర్లను ఇబ్బంది పెట్టిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో.. అగ్నిప్రమాదం

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ

TOP 5 ET: పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు?|బాలయ్యే కావాలంటున్న స్టార్ డైరెక్టర్లు

TOP 9 ET : ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా