మరింత క్లిష్టంగా మారిన.. పడవల తొలగింపు ప్రక్రియ

|

Sep 16, 2024 | 9:52 PM

ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆపరేషన్‌ అండర్ వాటర్‌ కంటిన్యూ అవుతోంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు ఐదోరోజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఆపరేషన్‌ మొదలుపెట్టి ఐదు రోజులు అవుతున్నా.. ఇంచ్‌ కూడా కదపలేకపోతోంది రెస్క్యూ టీమ్‌. ప్లాన్‌ A, ప్లాన్‌ B.. రెండూ ఫెయిల్‌ అయ్యాయ్‌. దాంతో, ప్లాన్‌ Cతో ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆపరేషన్‌ అండర్ వాటర్‌ కంటిన్యూ అవుతోంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు ఐదోరోజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఆపరేషన్‌ మొదలుపెట్టి ఐదు రోజులు అవుతున్నా.. ఇంచ్‌ కూడా కదపలేకపోతోంది రెస్క్యూ టీమ్‌. ప్లాన్‌ A, ప్లాన్‌ B.. రెండూ ఫెయిల్‌ అయ్యాయ్‌. దాంతో, ప్లాన్‌ Cతో ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ప్లాన్‌ Cలో భాగంగా కాకినాడ నుంచి అబ్బులు టీమ్‌ ను తీసుకొచ్చి రంగంలోకి దించారు. బోట్లు తొలగించడంలో ఎక్స్‌పర్ట్‌ అయిన అబ్బులు.. పడవలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుముందు ప్లాన్‌-Aలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. దీంతో ప్లాన్‌ A ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత ప్లాన్‌Bలో భాగంగా ఎయిర్‌ బెలూన్స్‌ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండడం, వాటర్ లెవెల్‌ తగ్గిపోవడంతో ప్లాన్-B కూడా ఫెయిల్‌ అయింది. ఇప్పుడు ప్లాన్‌-C సక్సెస్‌ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ షాపులో జ్యూస్ ​లో యూరిన్ కలిపి విక్రయం

Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..

Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్

సెల్ఫీ దిగాలంటేనే భయపడుతున్న రవీనా టండన్‌

Kaun Banega Crorepati: పవన్‌ కల్యాణ్‌పై ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న

Follow us on