కీళ్లనొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌ వాడుతున్నారా.. జాగ్రత్త

Updated on: Jun 05, 2024 | 3:05 PM

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు సమస్య మొదలవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కీళ్ల సమస్యలకు గురవుతున్నారు. యువత కూడా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వయసుకు ముందే ఎముకలు బలహీనపడుతున్నాయి. కీళ్లలోని కుషన్ కోతకు గురికావడం వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు సమస్య మొదలవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కీళ్ల సమస్యలకు గురవుతున్నారు. యువత కూడా కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వయసుకు ముందే ఎముకలు బలహీనపడుతున్నాయి. కీళ్లలోని కుషన్ కోతకు గురికావడం వల్ల కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ప్రాథమికంగా, కుషన్ కోత రెండు ఎముకల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. దీనివల్ల నొప్పి తీవ్రమవుతుంది. కీళ్ల నొప్పులు పెరిగినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. నొప్పి నివారణ మందులు తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పడు చూద్దాం. సముద్రపు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి ఎక్కువగా లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించి బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు, విటమిన్ ఇ, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వాపును తగ్గించడంతో పాటు, కూరగాయలు జాయింట్‌ ఫ్లెక్సిబిలిటీని చక్కగా నిర్వహిస్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లి ప్రేమ.. తప్పుడు పని చేయించింది.. అసలు ఏం జరిగిందంటే

ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ట్రైన్లో మీ ​ సీట్లో మరొకరు కూర్చున్నారా ?? గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి

Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్‌ దెబ్బకు దడుసుకుంది పో

రిజల్ట్‌ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్

Follow Us