జూబ్లీహిల్స్‌ అపోలో ఆలయంలో ఘనంగా తృతీయ పుష్కరోత్సవం

|

Mar 24, 2024 | 8:00 PM

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ తృతీయ పుష్కరోత్సవం ఘనంగా జరిగింది. వేడుకలకు త్రిదండి చినజీయర్‌స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్‌స్వామి సారథ్యంలో నిర్వహించిన అష్టోత్తరకలశపూజలో అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి దంపతులు, అపోలో గ్రూప్‌ ఎండీ సంగీతారెడ్డితో పాటు అపోలో ఆస్పత్రి ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ తృతీయ పుష్కరోత్సవం ఘనంగా జరిగింది. వేడుకలకు త్రిదండి చినజీయర్‌స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్‌స్వామి సారథ్యంలో నిర్వహించిన అష్టోత్తరకలశపూజలో అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి దంపతులు, అపోలో గ్రూప్‌ ఎండీ సంగీతారెడ్డితో పాటు అపోలో ఆస్పత్రి ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులకు చినజీయర్‌స్వామి మంగళాశాసనాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలోని ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు చినజీయర్‌స్వామి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ ఆలయానికి ఉందని చెప్పారు. ఆలయ తృతీయ పుష్కరోత్సవం సందర్భంగా పరంపర ఫౌండేషన్‌ నిర్వహించిన సంజీవని సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: శ్రీకాంత్‌ నివాసానికి కేక్‌తో వెళ్లిన చిరంజీవి

ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా ?? యమడేంజర్

తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు

మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా

దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి

Follow us on