క్వారంటైన్లోకి కేంద్రమంత్రి.. కారణం ఇదే..
కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజా ప్రతినిధుల వరకు అంతా వణికిపోతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీరందర్..
కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజా ప్రతినిధుల వరకు అంతా వణికిపోతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీరందర్ రైనాకి కరోనా పాజిటివ్గా నమోదైంది. దీంతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ నెల 12వ తేదీన కేంద్రమంత్రి.. జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్తో భేటీ అయ్యారు. అయితే ఆయనకు మంగళవారం నాడు పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే మంగళవారం సాయంత్రం 4.00 గంటల నుంచి హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, కరోనా పాజిటివ్గా తేలిన రైనా.. ప్రస్తుతం రియాసి జిల్లా కక్రయాల్లోని శ్రీ మాత వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందితున్నారు.
అయితే తాను గత వారం.. బందిపొరాలో బీజేపీ నేతకు చెందిన అంత్యక్రియల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత.. మంగళవారం ఉదయం కొద్దిపాటి జ్వరం వచ్చిందని.. దీంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలిందని తెలిపారు.
MoS PMO Jitendra Singh goes into self-quarantine after J&K BJP President Ravindra Raina tested positive for #COVID19 with whom he had come in contact. pic.twitter.com/mz5js3ucXM
— ANI (@ANI) July 14, 2020