గుడ్ న్యూస్: టీటీడీ కళ్యాణ మండపాల్లో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం..!
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఏపీలోని 13
Tirupati laddu: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఏపీలోని 13 జిల్లా కేంద్రాల్లోని… టీటీడీ కళ్యాణ మండపాల్లో మే 25 (సోమవారం) నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్లను తెచ్చింది టీటీడీ పాలక మండలి.
కాగా.. గతంలో ప్రకటించిన శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో, ఆలయ పోటు పేష్కార్ నంబర్లకు బదులుగా టీటీడీ… కాల్ సెంటర్ టోల్ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333 ను తెచ్చింది. ఇప్పుడు భక్తులు లడ్డూలు కావాలంటే ఏం చెయ్యాలి, ఎన్ని లడ్డూలు ఇస్తారు, ధర ఎంత, ఎలా ఇస్తారు, ఎలా బుక్ చేసుకోవాలి, కరోనా టైమ్లో లడ్డూలు తీసుకోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి, ఇలా ఏ డౌట్స్ ఉన్నా… ఈ టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చని టీటీడీ పాలక మండలి తెలిపింది.
Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!
Also Read: హైదరాబాద్లో కరోనా డేంజర్ బెల్స్.. కొత్త కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు..!