ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్కు ఎంతటి ఆదరణ లభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
ముఖ్యంగా యువత, ఉద్యోగులు ఈ కల్చర్కు బాగా అలవాటు పడుతున్నారు. డెలివరీ యాప్స్ మధ్య పెరిగిన పోటీ కూడా ఈ సేవలు విస్తరించడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే అంతా బాగానే ఉన్నా కొన్నిసార్లు డెలివరీ యాప్ సంస్థలు వ్యవహరించే తీరు కస్టమర్లకు ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్లో జరిగింది.
ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ యువతి జొమాటోలో చికెన్ మంచూరియా ఆర్డర్ చేసింది. అయితే దీరా ఆర్డర్ ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి చూస్తే అందులో చికెన్ మంచూరియాకు బదులుగా చికెన్ 65 వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని జొమాటో కస్టమర్ కేర్కు మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేసింది. తాను చికెన్ మంచూరియా ఆర్డర్ చేస్తే.. చికెన్ 65 వచ్చింది అంటూ మెసేజ్ చేసింది సదరు యువతి.
average zomato experience pic.twitter.com/8EcoP9SN1P
— ananya🍉 (@ananyapotatoe) October 14, 2024
అయితే సమస్యకు పరిష్కారం చూపించాల్సిందో పోగా.. చికెన్ 65ని తినమని కోరుతున్నామని, మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది అంటూ జొమాటా నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారి షాక్కి గురైన ఆ యువతి.. ఆ చాటింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముందు ఈ పోస్ట్ కాస్త వైరల్ అయ్యింది. జొమాటో తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిందో తప్పు, ఆపై ఉచిత సలహాలా.? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..