
దేశరాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యమునా నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీ శివారు ప్రాంతాలపై గురుగావ్ , ఘజియాబాద్ , నోయిడాలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షాలకు ఇళ్లు కుప్పకూలాయి.
భారీ వర్షాలు, వరదలతో పట్పర్గంజ్ ప్రాంతం పూర్తిగా జలమయం అయింది. వీధుల్లో యువకులు ఈత కొడుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. వీడియో వైరల్ అయినప్పటి నుండి, నెటిజన్లు ప్రభుత్వ నిర్వహణ సరిగా లేదని విమర్శించారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఢిల్లీలోని పట్పర్గంజ్లోని NH24 నుండి వచ్చింది, అక్కడ యువకులు నీటిని చిమ్ముతూ, అందులో ఈత కొడుతున్నట్లు కనిపిస్తుంది. నీటిలో మునిగిపోయిన వీధిని వీడియోలో చూడవచ్చు. బస్సు పైకప్పు నుండి యువకులు రోడ్డు మధ్యలో చిక్కుకుపోయారు. మరొక క్లిప్లో, వారు మోకాలి లోతు వరద నీటిలో ఈత కొడుతున్నట్లు చూడవచ్చు.
यह वीडियो दिल्ली की पटपरगंज के रोड का है । भाजपा की चार एंजिन की सरकार ने अब तो अब झूठे दावे करने भी बंद कर दिए हैं ।सोच रहे हैं कि बारिश का मौसम खत्म हो और बला टलें ।
दिल्ली वाले सोच रहे हैं आने वाले समय में ये भाजपा सरकार दिल्ली को हर क्षेत्र में पीछे धकेल देगी।
मेरा दिल्ली… pic.twitter.com/cO2gbuQ5Pj
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) August 29, 2025
కొద్దిసేపటికే వర్షం పడిన ఢిల్లీలోని రోడ్లు, వీధులు నదులుగా మారుతున్నాయి అంటూ నెటిజన్స్ విమర్శిస్తూ పోస్టులు పెడుతన్నారు. రాజకీయ నాయకుల సహకారంతో ఈత నేర్పడానికి కోచింగ్ ప్రారంభమైంది ధన్యవాదాలు, రేఖ గుప్తా జీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.