ట్రంప్‌ను కూడా తీసుకువస్తారేమో.. బీజేపీ నేతలపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్..

|

Nov 25, 2020 | 5:02 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంచి స్పీడుమీదున్న మంత్రి కేటీఆర్.. తన వాక్చాతుర్యంతో బీజేపీ నేతలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటీఆర్..

ట్రంప్‌ను కూడా తీసుకువస్తారేమో.. బీజేపీ నేతలపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంచి స్పీడుమీదున్న మంత్రి కేటీఆర్.. తన వాక్చాతుర్యంతో బీజేపీ నేతలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటీఆర్.. తాజాగా మరో సెటైరికల్ బాంబ్ పేల్చారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ స్థాయి లీడర్లు మొదలుకొని, వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు రావడంపై తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ నుంచి ప్రచారం కోసం వస్తున్నారని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి నాయకులను కూడా ప్రచారానికి తీసుకువస్తారేమో అని పంచ్ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్నేహితుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి తీసుకు వస్తారేమో అని సైటెర్లు పేల్చారు. అయితే ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ప్రజల దీవెనలే తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, బీజేపీ నేతలు తమ ప్రచారంలో ఏనాడూ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎంతసేపూ మత విద్వేషాలు రెచ్చగొట్టడంపైనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉందని దుయ్యబట్టారు. ‘బీజేపీ నేతలు నోరు తెరిస్తే అక్బర్, బాబర్, బిన్ లాడెన్‌ పేర్లనే జపిస్తారు. పదే పదే వారి పేర్లను ఎందుకు జపిస్తారో అర్థం కాదు. వారేమైనా హైదరాబాద్ ఓటర్లా..?’ అని మంత్రి కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.