పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన శ్రీకాంత్
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బృందం పోలీసులకు, సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం శ్రీకాంత్ బంజారాహిల్స్,..
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా హీరో శ్రీకాంత్ అతని బృందం పోలీసులకు, సాధారణ ప్రజలకు ఉచిత భోజనం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఉదయం శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు ఉచిత శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు శ్రీకాంత్. కాగా ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి తన వంతుగా రూ.5 లక్షల విరాళమిచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు హీరో శ్రీకాంత్, శ్రీ మిత్ర చౌదరి, నటుడు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read More:
జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు
పవన్తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
చరిత్రలో మొదటిసారిగా మైనస్లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..